హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 70, ఖమ్మంలో 21, కరీంనగర్లో 20 కేసులు రికార్డయ్యాయి.