అమరావతి : గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,32,105కు పెరిగాయి. ఇందులో 18,93,498 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 13,081 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,526 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
కొత్తగా నమోదైన మరణాల్లో ప్రకాశం జిల్లాలో కరోనాతో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు.. గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున బాధితులు మృతి చెందారు. ఏపీలో ఇవాళ ఒకే రోజు 93,785 నమూనాలను పరిశీలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 404, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308, కృష్ణ జిల్లాలో 269 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.