న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజునే గ్యాస్ బండ పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 249.50 పెంచుతూ శుక్రవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,253కు చేరుకొన్నది. ఇండ్లల్లో వాడుకొనే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. అయితే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్పై రూ. 50 వడ్డిస్తూ గత నెల 22న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 949.50గా ఉన్నది. పది రోజుల్లో తొమ్మిదిసార్లు ఇంధన ధరలు పెంచిన కేంద్రం.. లీటర్ పెట్రోల్పై మొత్తంగా రూ.7.22, లీటర్ డీజిల్పై రూ.6.96 చొప్పున వడ్డించింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది.
విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 2%(రూ.2,258.54) పెరిగింది. కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రికార్డు స్థాయిలో రూ.1,12,924.83కు చేరుకొన్నది. మరోవైపు, కిలో సీఎన్జీ ధర 80 పైసలు, పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్పై క్యూబిక్ మీటర్కు రూ.5 చొప్పున రేట్లు పెరిగాయి.