జైపూర్ : రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్లో కరోనా వైరస్ కోరలు చాచింది. ఐఐటీ క్యాంపస్లో నిన్న కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 25 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో క్యాంపస్లోని జీ 3 బ్లాక్ను అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విద్యార్థులందరినీ సూపర్ ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్యాంపస్ రిజిస్ర్టార్ అమర్దీప్ శర్మ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..