హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,551కు పెరిగింది. తాజాగా మరో 313 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,52,398 మంది కోలుకున్నారు. వైరస్తో మరో ఇద్దరు ప్రాణాలు వదలగా.. మృతుల సంఖ్య 3,895కు చేరింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.61శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 5,258 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇవాళ ఒకే రోజు 53,789 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది.