హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 173 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,749కు పెరిగింది. ఇప్పటి వరకు 6,57,213 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,916కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,620 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 52,683 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.