బెట్టిహా/గోపాల్గంజ్ (బీహార్): బీహార్లో కల్తీ మద్యం తాగి 24 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. గురువారం చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో 8 మంది మరణించారని, గోపాల్గంజ్లో మరణాల సంఖ్య 16కు చేరుకుందని అధికారులు తెలిపారు. బీహార్ మంత్రి జానక్ రామ్ మాట్లాడుతూ కల్తీ మద్యం మరణాల వెనుక కుట్ర ఉన్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. మరోవైపు బీహార్ సీఎం నితీశ్కుమార్ స్పందిస్తూ ప్రజాభిప్రాయం మేరకే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.