న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా ఏర్పడింది. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తర రైల్వేకు సంబంధించి 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పూరి న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, గయా న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, సహస్ర న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, హౌరా – న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, చెన్నై న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, లక్నో న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యగా నడుస్తున్నాయి.
గురువారం రోజు కూడా 13 రైళ్లు ఆలస్యంగా రాకపోకలు కొనసాగించాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఢిల్లీలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.