న్యూఢిల్లీ : 2022 బాలెనో బుకింగ్స్ ప్రారంభమయ్యాయని మారుతి సుజుకి ప్రకటించింది. టీజర్ ఇమేజ్లో కారు తాజా రీడిజైన్ ఆకట్టుకునేలా ఉంది. గతంలో కంటే బాలెనో వైడర్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. హెడప్ డిస్ప్లే వంటి నూతన ఫీచర్లను జోడించాడు. నెక్సా డీలర్లతో పాటు నెక్సా వెబ్సైట్లో రూ 11,000 చెల్లించి బాలెనోను కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు.
న్యూ బాలెనో స్లిమ్మర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో పాటు లార్జర్ గ్రిల్, మాస్క్యులర్ అప్పియరెన్స్తో అలరిస్తోంది. రియర్ సైడ్ విశాలంగా, రీడిజైన్డ్ టెయిల్ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలెనో బ్రాండ్ భారత్లో ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ను రీడిఫైన్ చేసిందని, బాలెనో దేశంలో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచిందని నూతన బాలెనో లాంఛ్ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఆధునిక యువ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా న్యూ ఏజ్ బాలెనోను తీర్చిదిద్దామని, సుపీరియర్ ఇన్ కార్ టెక్నాలజీతో పాటు ఎక్స్ప్రెసివ్ డిజైన్, అల్టిమేట్ అర్బన్ క్రూజింగ్ అనుభూతిని ఈ కారు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూ ఏజ్ బాలెనో అత్యాధునిక టెక్నాలజీ, అద్భుత సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కారు రూ 6.14 లక్షల నుంచి రూ 9.66 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య అందుబాటులో ఉంటుంది. న్యూ ఏజ్ బాలెనో టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20లకు దీటైన పోటీ ఇవ్వనుంది.