ఢాకా: మహిళల అండర్-19 దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్(సాఫ్)లో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 0-1 తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని చవిచూసింది. 80వ నిమిషంలో అనాయ్ మోగిని చేసిన ఏకైక గోల్తో ఆతిథ్య జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. 80వ నిమిషం వరకు స్కోర్ నమోదు కాలేదంటే ఇరు జట్లు ఎంత హోరాహోరీగా తలపడ్డాయో అర్థమవుతుంది. మోగిని గోల్తో బంగ్లా ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత్ ఒత్తిడిలో పడింది. ఆఖరి వరకు గోల్ కోసం ప్రయత్నం చేసిన టీమ్ఇండియా ఆశలు నెరవేరలేదు.