మెదక్ : కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై నుంచి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.