దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో వాచ్చే వారం నుంచి రష్యాకు చెందిన కరోనా టీకా స్పుత్నిక్-వీ టీకాలు వేయనున్నారు. మధుకర్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పటల్లో ఈ నెల 20 నుంచి టీకా వేయడం ప్రారంభించనున్నారు. అపాయింట్మెంట్ స్లాట్లను కొవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆసుపత్రిలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగులకు టీకాలు ఆదివారం వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు.
స్పుత్నిక్ వీ వెయ్యి టీకాలు అపోలో ఆసుపత్రికి చేరుకోగా.. ఇందులో 170 మోతాదులు ల్యాబ్ ఉద్యోగులకు అందించినట్లు అధికారులు చెప్పారు. దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత స్పుత్నిక్-వీ దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకా. ప్రస్తుతం టీకాను ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తుండగా.. కేంద్రం మోతాదుకు ధర రూ.1,145గా నిర్ణయించింది. రష్యాకు చెందిన వ్యాక్సిన్ను దేశంలో ఉత్పత్తి, మార్కెటింగ్కు ఆర్డీఐఎఫ్తో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.