హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గత రెండేండ్లలో కరోనా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఈ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్లో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ప్రయాణ ఆంక్షలతో దేశంలోని పర్యాటక రంగం ఢీలా పడింది. ఇతర దేశాల నుంచి పర్యాటకులు రాకపోవడం, దేశంలోనే ఇతర రాష్ర్టాలకు వెళ్లాలన్నా ప్రభుత్వం విధించిన ఆంక్షలు పర్యాటకాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. దీంతో ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఫలితంగా దేశంలో గడిచిన రెండేండ్లలో పర్యాటక రంగంలో 2.15 కోట్ల ఉద్యోగాలు పోయాయి. తొలివేవ్లోనే అత్యధికంగా 1.45 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని కేంద్రం పేర్కొన్నది.
ప్రైవేటు టూరిజం ట్రావెల్స్, హోటల్స్లో కొన్ని ఉద్యోగాలు పోయాయి. హరిత హోటళ్లు, పర్యాటక శాఖ ట్రావెల్స్ మాత్రం ఎవరినీ తీసేయలేదు. విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. 2019-20లో మూడున్నర లక్షల మంది రాష్ర్టాన్ని సందర్శించారు. కానీ గత రెండేండ్లలో 50 వేల మంది కూడా రాలేదు. స్థానిక పర్యాటకులు కూడా సగానికి తగ్గారు.
-మనోహర్రావు, టీఎస్టీడీసీ, ఎండీ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ డోసుల విషయంలో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిషీల్డ్ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధి 8-16 వారాలకు తగ్గించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఫస్ట్ డోసు ఇచ్చిన 12-16 వారాల తర్వాత సెకండ్ డోసు ఇస్తున్నారు. కొవిషీల్డ్ రెండో డోసును 8 వారాల తర్వాత ఇచ్చినప్పుడు లేదా 12-16 వారాల మధ్యలో ఇచ్చినప్పుడు యాంటీబాడీస్ సమానంగా వృద్ధి చెందినట్టు తేలిందని అధికారికవర్గాలు తెలిపాయి.
ఫస్ట్వేవ్ సెకండ్వేవ్ థర్డ్వేవ్
కోల్పోయిన ఉద్యోగాలు 1.45 కోట్లు 52 లక్షలు 18 లక్షలు
పడిపోయిన విదేశీ పర్యాటకుల రాక 93.3 శాతం 79.5 శాతం 64.3 శాతం
పర్యాటక ఆదాయ నష్టం 42.8 శాతం 15.5 శాతం 1.1 శాతం