హైదరాబాద్, ఏప్రిల్ 25: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.1,861 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.189 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే 6.3 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, నికర లాభంలో 16 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం ఆదాయంలో డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల నుంచి 80 శాతం సమకూరాయి. ప్రస్తుతం 902 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, ఇంజినీరింగ్, టెక్నాలజీ సొల్యుషన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు. గతేడాదికిగాను రూ.30 డివిడెండ్ను ప్రకటించింది.