హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 153 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 52, కరీంనగర్లో 12, నల్లగొండలో 14, రంగారెడ్డిలో 11, వరంగల్ అర్బన్లో 9 కేసులు నమోదైనట్టు తెలిపింది. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,73,140 మందికి కరోనా సోకింది. 3,737 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 98.85 శాతానికి చేరుకున్నది.