హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): పదిహేను గంటల్లో 150 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేయడమంటేనే అసాధారణ విషయం.. అదీ కండ్లకు గంతలు కట్టుకుని అంటే సాహసమనే చెప్పాలి. అలాంటిది ఈ అరుదైన విన్యాసాన్ని ఎనిమిదేండ్ల బుడతడు సాధించి ఔరా అనిపించాడు. ఏపీలోని నగరికి చెందిన భారతీరాజా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కర్ణాటక సరిహద్దులోని నన్గళీ నుంచి నగరి వరకు కండ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్ చేసి చిల్డ్రన్స్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు.