తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు రూ.1.80 కోట్లు విలువైన బంగారు పతకాలను (Gold medals) అందజేశారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను సోమవారం శ్రీవారికి తిరుమలలో బహుకరించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు వీటిని అందజేశారు.ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీకి రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ విరాళం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( UBI ) టీటీడీకి మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.20 లక్షలు విలువైన రోస్సరి ప్రోఫెషనల్ కంపెనీకి చెందిన రాస్ స్ట్రీట్ ఆర్వో 1500 రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ను విరాళంగా అందించింది.శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి జీఎం పత్రి శ్రీనివాస్ మెషిన్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఆరోగ్యాధికారి డాక్టర్ మధుసూదన్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.