బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ శైలి మారడం లేదు. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 31-51తో పుణెరి పల్టన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పల్టాన్ రైడర్లు దూకుడు ప్రదర్శించగా.. తెలుగు ఆటగాళ్లు ప్రతిఘటించలేక చేతులెత్తేశారు. టైటాన్స్ తరఫున అంకిత్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. మరో పోరులో యూ ముంబా 37-27తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది.