అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,282 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి తొమ్మిది ప్రాణాలు వదిలారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,38,690కి పెరిగాయి. 20,09,921 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 14,070 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14,699 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్తో చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 231, ఈస్ట్ గోదావరిలో 198, ప్రకాశంలో 161, కృష్ణాలో 144, గుంటూరులో 141, నెల్లూరులో 139, పశ్చిమ గోదావరిలో 128 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.