అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,155 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,186 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీంతో మొత్తం కేసుల 20,15,302కి చేరింది. కొత్తగా వైరస్ ప్రభావంతో పది మంది ప్రాణాలు వదిలారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,867కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 1,396 మంది వైరస్ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 19,86,962కు మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,473 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొ క్క రు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 175, చిత్తూరులో 171, నెల్లూరులో 156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.