రామగిరి, ఫిబ్రవరి 10: పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏపీఏ ఏరియాలో విధులు నిర్వర్తిస్తూ వివిధ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల డిపెండెంట్లు 11 మందికి గురువారం జీఎం కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాలను జీఎం ఎన్వీకే శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. 11 మందిలో ఒక మహిళకు కార్పొరేట్ ఏరియాకు మిగతా 10 మందికి ఏఎల్పీ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో ఇంత మంచి ఉద్యోగం రావడం ఒక వరమన్నారు.
క్రమశిక్షణతో పని చేసి అధికారుల వద్ద మన్ననలు పొంది పదోన్నతుల ద్వారా జీవితంలో మరింత పైకి రావాలని, తద్వారా సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఎస్వోటూ జీఎం బైద్య, డీవైపీఎం రవీందర్ రెడ్డి, సీనియర్ పీవో నాగేశ్వరరావు తదితరులున్నారు.