హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బోయిగూడ తుక్కు గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి 11 మంది సజీవ దహనమయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలే. షార్ట్సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లుచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఒక్కో కుటుంబానికి పీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
బోయిగూడలో సుధాకర్రెడ్డికి చెందిన స్థలాన్ని డోకి సంపత్కుమార్ లీజుకు తీసుకొని శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో తుక్కు(స్క్రాప్) గోడౌన్ నిర్వహిస్తున్నాడు. వాడేసిన మద్యం సీసాలు, పాత పేపర్లు, కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఈ గోడౌన్లో భద్రపరుస్తారు. వాటన్నింటినీ వేరుచేసి లారీలో తరలించి రీసైక్లింగ్ యూనిట్లకు విక్రయిస్తారు. ఇక్కడ బీహార్ రాష్ట్రంలోని చాప్రా, కాతిహార్ జిల్లాలకు చెందిన 12 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరి కోసం గోడౌన్లో పైఅంతస్థులో మూడు గదులను నిర్మించారు. ఒక గది వంటకు, మిగతావి కార్మికులు నిద్రపోవడానికి కేటాయించారు. ఈ గదుల నుంచి కిందకు వెళ్లేందుకు ఇను ప మెట్లు ఏర్పాటుచేశారు.
మంగళవారం రాత్రి 12 మంది కూలీలు భోజనా లు చేసి రెండు గదుల్లో నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గోడౌన్ లో మంటలు చెలరేగాయి. కూలీలు నిద్రిస్తున్న గదుల కు కూడా వ్యాపించాయి. దీన్ని గుర్తించిన ప్రేమ్ వెం టనే కిటికీ ఊచలు వంచి మొదటి అంతస్థు నుంచి కిం దికి దూకేశాడు. నగరంలో వేర్వేరు చోట్ల పనిచేస్తున్న తోటి కూలీలకు సమాచారం ఇచ్చాడు. మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు ఉదయం 3.55 గంటలకు, పోలీసులకు 3.59 గంటలకు సమాచారం ఇచ్చారు. గాంధీ దవాఖాన లో ఉన్న ఫైర్ఇంజిన్ మూడు నిమిషాల్లోపే వచ్చింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, గౌలిగూడ, సచివాల యం వద్ద ఫైర్స్టేషన్ల నుంచి మరో 7 ఫైర్ఇంజిన్లు వ చ్చి మంటలను అదుపుచేసే ప్ర యత్నం చేశాయి. అప్పటికే అపస్మాకర స్థితిలో పడిపోయిన ప్రేమ్ను అగ్నిమాపక సిబ్బంది గుర్తించి తట్టిలేపి ప్రశ్నించగా, గదిలో 11 మంది ఉన్నారని తెలిపాడు. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బంది పైగదుల్లో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే వాళ్లంతా సజీవ దహనమయ్యారు. ఇనుప మెట్లకు కూడా మంటలు అంటుకోవడంతో కిం దకు దిగేదారికి లేక, ప్లాస్టిక్ కేబుల్స్ కాలిపోయి కార్బన్మోనాక్సైడ్ కమ్మేయడంతో ఊపిరాడక కార్మికుల ంతా మంటల్లో కుప్పకూలిపోయారు.
షార్ట్సర్క్యూట్తోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నా, మంటలు త్వరగా వ్యాపించడానికి కార్మికుల గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అవడం కారణం కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రేమ్ పె ద్ద శబ్దం వచ్చిందని చెప్పడం తో, వంట గదిలోని సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రౌండ్ఫ్లోర్ ను ంచే మంటలు ప్రారంభమయ్యాయని అగ్నిమాపకశాఖ చెప్తున్నది. స్పష్టత కోసం హైదరాబాద్ క్లూస్టీం ఘటనాస్థలంలో నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నది. ప్రేమ్ ఫిర్యాదుతో గోడౌన్ నిర్వాహకుడు సంపత్పై 304ఏ, 337 ఐపీసీ సెక్షన్ల కింద గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాద స్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సీఎస్ సోమేశ్కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయ ర్ మోతె శ్రీలత తదితరులు సందర్శించారు. పోస్టుమా ర్టం అనంతరం మృతదేహాలను బీహార్కు విమానంలో తరలిస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హోం మంత్రి ఘటనాస్థలాన్ని సందర్శిస్తున్న సమయంలో అప్పటికే కాలిపోయి ఉన్న గోడ కూలిపోయింది. దీం తో హోంమంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఉన్న టింబర్, స్క్రాప్ గోదాంలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ అగ్నిమాపకశాఖ, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంపై హోంమంత్రి స్పందించారు. మధ్యాహ్నం తన కార్యాలయంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్రెడ్డి, ఫైర్ డీజీ సంజయ్కుమార్జైన్, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్భగవత్, తదితరులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మృతుల వివరాలు
పేరు వయస్సు
రాజేశ్ 22
బిహుకుమార్ 21
దీపక్రామ్ 36
బిట్టిలాల్రామ్ 22
సికిందర్రాం 30
బింటుకుమార్ 25
దినేశ్కుమార్ 35
సత్యేంద్రకుమార్ 38
దామోదర్కుమార్ 25
రాజేశ్కుమార్ 30
అంకజ్కుమార్ 22