వాషింగ్టన్: యూకే, అమెరికాలోని వేలాది మంది రోహింగ్యా ముస్లిం శరణార్థులు మెటా సంస్థ(ఫేస్బుక్)పై 150 బిలియన్ డాలర్ల (రూ.11 లక్షల కోట్లు) దావా వేశారు. తమ కమ్యూనిటీకి వ్యతిరేకమైన విద్వేష ప్రసంగాలను ఫేస్బుక్ తన ప్లాట్ఫాంపై అనుమతిస్తున్నదని, దీని ఫలితంగా మయన్మార్లో ఇప్పటికే అణచివేత, పీడనకు గురైన రోహింగ్యా మైనార్టీలపై మరింత హింసకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులు, వీడియోల రూపంలో ఇటువంటి నీచమైన, అబద్ధాలతో కూడిన ప్రచారం సంవత్సరాల పాటు కొనసాగేందుకు ఫేస్బుక్ అవకాశం కల్పించిందని ఆరోపిస్తూ.. జరిగిన నష్టానికి 150 బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని కోరుతూ రోహింగ్యాలు కాలిఫోర్నియా కోర్టులో దావా దాఖలు చేశారు.