హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రాష్ట్రప్రభుత్వం రూ. 107 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2021-22లో రాష్ట్రప్రభుత్వం ముందుగా రూ.17.40 కోట్లు కేటాయించింది. తర్వాత అదనంగా రూ.90.24 కోట్లు కేటాయించింది. గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి ఈ నిధులను వెచ్చిస్తారు. పీఎంకేఎస్వైకి రూ.6.70 కోట్లు విడుదల చేస్తూ సుల్తానియా మరో ఉత్తర్వు జారీచేశారు.