ముషీరాబాద్, ఏప్రిల్ 24: మాదిగలు, మాదిగ ఉప కులాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ హెచ్చరించారు. ఆదివారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వ హించి.. అనుబంధ సంఘాలు, మేధావులతో చర్చించి భవిష్య త్తు కార్యాచరణ రూపొం దిస్తామని తెలిపారు. సమా వేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొండ్ర శంకర్, మీసాల మల్లేశ్, పొట్టపెంజర రమేశ్, గుర్రాల శ్రీనివాస్, సంజీవ, చింత బాబు పాల్గొన్నారు.