మైలార్దేవ్పల్లి,ఫిబ్రవరి6: దుర్గానగర్ పంప్హౌస్ కృష్ణాఫేజ్ 2 పైపులైన్ మరమ్మతుల కారణంగా డివిజన్ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని మైలార్దేవ్పల్లి డివిజన్ జలమండలి డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ సత్తార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆదివారం డివిజన్ పరిధిలోని దుర్గానగర్ పంప్హౌస్ సమీపంలో ఫేజ్ 2 పైపులైన్ ప్రధాన వాల్వ్ జామ్ కావడంతో మరమ్మతులను మేనేజర్ వినాయక్తో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం డీజీఎం సత్తార్ మాట్లాడుతూ..కొన్ని కాలనీల్లో సోమవారం నుంచి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు గమనించాలని కోరా రు.
డివిజన్లోని కాటేదాన్ సెక్షన్లోని మధుబన్ కాలనీ,టీఎన్జీవోస్ కాలనీ, సాయి కాలనీ,గణేశ్నగర్ ,ఆప్కో కాలనీ,పద్మశాలిపురం,లక్ష్మీగూడ హౌసింగ్బోర్డు కాలనీ,నేతాజీనగర్, వెంకటేశ్వర కాలనీ,న్యూ బృందావన్ కాలనీ,శ్రీరామ్నగర్ ,మైలార్దేవ్పల్లి సెక్షన్లోని మోగల్స్ కాలనీ,పల్లెచెరువు,మైలార్దేవ్పల్లి విలేజ్ ,మిలాన్ కాలనీ,అహ్మద్ నగర్ ,ఆలీనగర్ ,సుభాన్కాలనీ,ఫేజ్ 1,ఫేజ్ 2,ప్యాలేస్ వ్యూకాలనీ,కాలనీ,లలో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అన్నారు.ప్రజలు ఇబ్బందులు పడకుండా కొన్ని కాలనీల్లో వాటర్ ట్యాంకుల ద్వారా కాలనీల్లో తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ సూర్యనారాయణ,సిబ్బంది వెంకటేశ్ తదితరులు ఉన్నారు.