హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల దివ్యాంగుల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో బంగ్లా జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బంగ్లా బౌలింగ్ ధాటికి టీమ్ఇండియా 111 పరుగులకే ఆలౌటైంది. టైటిల్ విజేత బంగ్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మహమ్మద్ అలీఖురేషి, ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.