న్యూఢిల్లీ, జనవరి 17: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా మరో విదేశీ సంస్థను చేజిక్కించుకున్నది. యూరప్కు చెందిన టెక్నాలజీ సంస్థయైన సీటీసీలో 100 శాతం వాటాను, మరో రెండు సంస్థల్లో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.2,800 కోట్లకు పైమాటే(330 మిలియన్ యూరోలు). డిజిటల్ ఇంజినీరింగ్, ఇన్సూరెన్స్ టెక్నాలజీ వ్యాపారాలను మరింత బలోపేతం చేయడానికి ఈ కొనుగోళ్ళు జరిపినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. 2010లో జరిగిన సత్యం కుంభకోణం తర్వాత టెక్ మహీంద్రా కొనుగోలు చేసిన రెండో అతిపెద్ద ఒప్పందం ఇదే కావడం విశేషం.