బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ (జేఎన్సీఏఎస్ఆర్)లో కింది ప్రోగ్రామ్లలో మిడ్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రోగ్రామ్స్: పీహెచ్డీ, ఎంఎస్ (ఇంజినీరింగ్), ఎంఎస్ (రిసెర్చ్)
విభాగాలు: కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్ మెకానిక్స్, థియరిటికల్ సైన్సెస్, న్యూ కెమిస్ట్రీ, ఎవల్యూషనరీ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, న్యూరోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంఈ/ఎంటెక్, బీటెక్ ఉత్తీర్ణత. విభాగాన్ని అనుసరించి సీఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డీబీటీ జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్/ ఇన్స్పైర్/ జీప్యాట్/ జెస్ట్/ గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. అవసరం మేరకు ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రిలిమినరీ ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.
ఫెలోషిప్: పీహెచ్డీ అభ్యర్థులకు జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ కింద మొదటి రెండేండ్లు నెలకు రూ.31,000. చివరి మూడేండ్లలో నెలకు రూ.35,000. ఎంఎస్ (ఇంజినీరింగ్/ రిసెర్చ్) అభ్యర్థులకు స్కాలర్షిప్ కింద నెలకు రూ.31,000 ఇస్తారు. వివిధ దేశాల్లో నిర్వహించే నేషనల్/ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యేందుకు వన్ టైం స్టూడెంట్స్ ట్రావెల్ గ్రాంట్ కింద పీహెచ్డీ అభ్యర్థులకు రూ.1,00,000. ఎంఎస్ అభ్యర్థులకు రూ.40,000 చెల్లిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరితేదీ: నవంబర్ 22
వెబ్సైట్: https://www.jncasr.ac.in