గేయ రచయిత తైదల బాపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి విభిన్న చిత్రాలను నిర్మించాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ…‘దాదాపు 250 చిత్రాలకు పనిచేసిన అనుభవం నాది. సుమారు 500 పాటలు రాశాను. సోమవారం నా పుట్టినరోజు సందర్భంగా మా సొంత జిల్లా మంచిర్యాలలో 2022 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను. ప్రకృతికి మంచి చేసే కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇకపైనా గీత రచయితగా కొనసాగుతూనే నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు నిర్మించాలని ఆశిస్తున్నా’ అన్నారు.