చర్లపల్లి, జనవరి 20 : చర్లపల్లి డివిజన్లో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని చర్లపల్లి రామాలయం వద్ద సైన్ వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు బస్తీ దవాఖానలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, కంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సైన్ వైద్యశాల వైద్యులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.