హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్కు చెందిన గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అతిరత్లో కలారి క్యాపిటల్ పెట్టుబడి పెట్టింది. ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రొడక్ట్స్ను మరింత బలోపేతం చేయడానికి, మరింత మంది సిబ్బందిని నియమించుకోవడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ గేమింగ్ మార్కెట్లో టాప్-5లోపే ఉన్న భారత్లో అత్యధిక మంది గేమింగ్ అడుతున్నారు. ఇంటర్నెట్ వాడకం అత్యధికంగా ఉండటం ఇందుకు కారణం. 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ గేమింగ్ మార్కెట్..2025 నాటికి 7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనున్నదన్న అంచనా. సరాసరిగా భారత్లో వారానికి 8.5 గంటల పాటు గేమింగ్ అడుతున్నారట.