ట్యాంక్బండ్ కొత్త సొబగులు అద్దుకుంటున్నది. హైదరాబాద్- సికింద్రాబాద్ల మధ్య వారధిగా ఉన్న ఈ బండ్ పరిసరాలను హెచ్ఎండీఏ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా చెట్ల మొదళ్ల వద్ద ఆకర్షణీయమైన రెయిన్ ప్రూఫ్ బెంచీలను ఇప్పటికే హెచ్ఏండీఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బెంచీలు చెట్లకు రక్షణ ఇవ్వడంతో పాటు వీటిపై పర్యాటకులు కూర్చొని సాగర్ అందాలను తనివితీరా చూడవచ్చని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్ పేర్కొంటూ ట్విట్టర్లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. ఇలాంటి రెయిన్ ప్రూఫ్ బెంచీలను పీవీఎన్ఆర్ మార్గ్(నెక్లెస్ రోడ్డు)లోనూ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.