Pranahitha Pushkaralu | గోదావరి నదికి ప్రధాన ఉపనది, జీవనది అయిన ప్రాణహిత పుష్కరాలు మొదలయ్యాయి. చైత్రశుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 బుధవారం ఉదయం నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి ఏప్రిల్ 24 వరకు అంటే 12 రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం దేవగురు బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రాణహిత నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తుమ్మిడిహేట్టి పుష్కర స్నానాల ఘాట్ల వద్ద కార్తీక మహారాజ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఘాట్ల వద్ద పుష్కర పుణ్య స్నానాలు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రారంభించారు.