Chhath puja | ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఛఠ్ పూజను కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. బిహార్, జార్ఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయాన్నే సమీపంలోని నదులు, చెరువుల వద్దకు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించి.. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సాధారణంగా దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా 36 గంటల పాటు ఉపవాసం ఉంటారు. నదీ ఘాట్ల వద్ద స్నానం ఆచరించి.. అక్కడే దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.