సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. ఆదివారం నిర్వహించిన పట్నంవారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.