Pranahitha Pushkaralu | ప్రాణహిత పుష్కరాలకు భక్తజనం పోటెత్తింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, కోటపల్లి, వేమనపల్లి, కౌటాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం కోటపల్లిలో లక్ష మంది, కౌటాలలో 4 వేల మంది, వేమనపల్లిలో రెండు వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.