Chhath Puja | ఒకవైపు పవిత్రంగా జరుపుకునే పండుగ.. మరోవైపు ప్రాణాలకు హాని చేసే విషపు నురగలు.. ఏం చేయాలి? దేనికి తలొగ్గాలి? అంటే వాళ్లు భక్తి మార్గానికే ఓటేశారు. ఛట్ పూజ సందర్భంగా ఢిల్లీవాసులు కాలుష్యంతో ఉప్పొంగుతున్న యమునా నదిలోనే పుణ్యస్నానాలు ఆచరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత ఉత్తరాదిలో ఛట్ పూజ చేస్తారు. ఈ సందర్భంగా సమీపంలోని నదిలో స్నానమాచరించి సూర్యభగవానుడికి పూజలు నిర్వహిస్తారు. కానీ కాలుష్యం కారణంగా యమునా నది ( yamuna river ) విషపు నురగలతో ఉప్పొంగుతుంది. సరిగ్గా పండుగ సమయంలోనే ఈ పరిస్థితి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో మహిళలు ఇలా ఆ కలుషిత నీటిలోనే పవిత్ర స్నానాలు ఆచరించారు.