గ్రామీణ రోడ్ల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. గురువారం మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లో ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొయినాబాద్లో రూ.11.22 కోట్లు, చేవెళ్లలో రూ.5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యధిక నిధులతో రహదారులను నిర్మిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారన్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం మిషన్ భగీరథ పథకమేనన్నారు. ఈ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తూ తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపారన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మరింత మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మొయినాబాద్/చేవెళ్ల/చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 7 : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్రి మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అ భివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ-బాకారం రోడ్డు అభివృద్ధికి రూ.3 కోట్లు, అమ్డాపూర్-శ్రీరాంనగర్ వరకు రూ.3.50 కోట్లు, ముర్తుజాగూడ-సురంగల్ రోడ్డు వరకు రూ.1.45 కోట్లు, ముర్తుజాగూడ నుంచి అమ్డాపూర్కు వెళ్లే రోడ్డు వరకు రూ.47 లక్షలు, పెద్దమంగళారం నుంచి చందానగర్ చౌరస్తా వరకు రూ.2.80 కోట్ల చొప్పున బీటీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టే పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. అలాగే చేవెళ్ల మండల కేంద్రంలో పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి చేవె ళ్ల వరకు రూ.కోటి, ఆలూరి నుంచి న్యాలట ఎక్స్ రోడ్డు వరకు రూ.4.50 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనులు చేశారు. పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, లైబ్రరీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను సమానంగా తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ది భగీరథ ప్రయత్నం..
సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి అసాధ్యా న్ని.. సుసాధ్యం చేసిన అపర భగీరథుడని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేసవి కాలం వస్తే గొంతు తడుపుకోవడానికి సై తం తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. తె లంగాణ ఏర్పాటు తర్వాత దాహార్తిని తీర్చుకోవడానికి మహిళలు ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి మిష న్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు సరఫరా చేయిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమత, మాజీ జడ్పీటీసీలు అనంతరెడ్డి, చంద్రలింగంగౌడ్, సీనియ ర్ నాయకులు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్యాదవ్, బాల్రాజ్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, సర్పంచ్ల సంఘం మం డల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివస్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహు లు, నాగిరెడ్డిగూడ సర్పంచ్ లక్ష్మమ్మ, బాకారం సర్పంచ్ రాఘవరెడ్డి, ఎంపీటీసీ అర్జున్, అమ్డాపూర్ సర్పంచ్ రవళి, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, ముర్తుజాగూడ సర్పంచ్ మణెమ్మ, చేవెళ్ల సర్పం చ్ శైలజ, పల్గుట్ట సర్పంచ్ జనార్దన్రెడ్డి, తోలుకట్ట సర్పంచ్ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్ రాజు, పీఆర్ డీఈలు విజయ్, జగన్రెడ్డి, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ ర వీందర్యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకు లు పెంటారెడ్డి, షేక్ మహూబుబ్, సురేందర్గౌ డ్, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాల అధ్యక్షులు పరమేశ్, శేఖర్, నాయకులు గోపికృష్ణారెడ్డి, విక్రంరెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహులు, జ శ్వంత్గౌడ్, శ్రీవవాస్యాదవ్, వెంకటేశ్యాద వ్, ప్రవీణ్, చెన్నయ్యయాదవ్, భాస్కర్, యాదగిరిచారి, డేవిడ్ పాల్గొన్నారు.
రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు అధిక వ ర్షాల కారణంగా దెబ్బతినడంతో ప్రజలకు ఇ బ్బంది కలుగకుండా ప్రభుత్వం రూ.కోట్ల ని ధులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామా ల్లో ఇప్పటికే కొన్ని రోడ్లు అభివృద్ధి చేశామని, మిగిలిన రోడ్లకు నిధులు మంజూరు చేసి శంకు స్థాపనులు చేశామని, త్వరలో వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలు వచ్చే వరకు అ ని ్న గ్రామీణ రోడ్లు అభివృద్ధిలోకి వస్తాయని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ ప థకాలు అవసరమో సీఎం కేసీఆర్ తెలుసుకుని వారి అవసరానికి అనుగుణంగా ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.
.ఆమనగల్లు : రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్గా నియమితులైన గోలి శ్రీనివాస్రెడ్డి గురువా రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపినట్లు గోలి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.