కేంద్ర రక్షణ సంస్థల నిలయం.. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన మార్గం.. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కంచన్బాగ్- ఒవైసీ దవాఖాన మార్గంలో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. పిసల్బండ డీఆర్డీఎల్ నుంచి ఒవైసీ దవాఖాన జంక్షన్ మీదుగా బైరామల్గూడ వైపు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి వంతెనకు ప్రముఖ శాస్త్రవేత్త,మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును నామకరణం చేశారు.
అబ్దుల్ కలాం సుదీర్ఘకాలంపాటు డీఆర్డీవోలో విధులు నిర్వర్తించి ఇక్కడే నివాసం ఉండటంతో ఆయన జ్ఞాపకార్థం ఫ్లైఓవర్కు నామకరణం చేసినట్లు మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 1.36 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లైఓవర్తో పాతబస్తీవాసుల కల నెరవేరిందని, నగర తూర్పు-పడమర ప్రాంతాలను కలిపే వారధిగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు మహమూద్అలీ, సబితారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మేయర్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, సుధీర్రెడ్డి,ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
చార్మినార్ /సైదాబాద్, డిసెంబర్ 28: నగరంలో ఓవైసీ-మిధాని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ను మంగళవారం రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఈ ఫ్లై ఓవర్కు అబ్దుల్ కలామ్ పేరును నామకరణం చేశారు. దీంతో పాత బస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరినైట్లెంది. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పాత బస్తీకి ఈ ఫ్ల్లై ఓవర్ మణిహారంలా మారింది. తూర్పు-దక్షిణ ప్రాంతమైన పాతబస్తీకి ఈ వంతెన వారధిగా నిలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సమాన దృష్టితో చూస్తున్నదని, ఈ విషయం అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ నిర్మాణంతో రుజువైంది. గ్రేటర్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణంలో భాగంగా పాతబస్తీ నగర ప్రజలకు పై వంతెన అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి చాంద్రాయణ గుట్ట నుం చి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఒవైసీ దవాఖాన జంక్ష న్, చంపాపేట, మందమల్లమ్మ చౌరస్తా మీదుగా సాగర్ రింగ్ రోడ్డు వైపు మీదుగా బైరామల్గూడ, ఎల్బీనగర్ వైపు వెళ్లే వాహనాలు ఇక ఆగేది ఉండదు. కంచన్బాగ్లోని ఫిసల్బండ, డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ దవాఖాన జంక్షన్ మీదుగా బైరామల్గూడ వైపు 1.36 కిల్లో మీటర్ల పొడవుతో మూడు లైన్ల యూనీ డైరెక్షన్ ఫ్లై ఓవర్తో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయి. అదే విధంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట వైపు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డను విస్తరించడంతో వాహనాలు సైతం ఈ మార్గం గుండా సాఫీగా వెళ్లనున్నాయి. వంతెనకు ఇరువైపుల సర్వీస్ రోడ్లను కూడా అభివృద్ధి చేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణం సజావుగా సాగనున్నది.
ఫ్లై ్లఓవర్ బ్రిడ్జి కింద మొక్కల సుందరీకరణ పనులు, లైన్ మార్కింగ్, పెయింటింగ్ ఫినిషింగ్, కలరింగ్, గ్రీనరీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ దీపాల ఏర్పాటుతో ఫ్లైఓవర్ శోభాయమానంగా కనిపిస్తున్నది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ైప్లె ఓవర్ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ పాతనగర ప్రజలకు అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇటు కర్నూల్ జాతీయ రహదారితో పాటు అటు విజయవాడ జాతీయ రహదారులను అనుసంధానిస్తున్నది. విమానాశ్రయ మార్గాన్ని మరింత సులభతరం చేసే ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో పాతనగరం మరింత అభివృద్ధి సాదించనున్నది. – మీనాక్షి, టీఆర్ఎస్
పాతనగరంలో ఇప్పటికే కొనసాగుతున్న ఆరు ఫ్లై ఓవర్లకు తోడుగా కొత్తగా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం పాతనగరానికి చరిత్రాత్మక పరిణామం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్కు సమీపంలో రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలతో పాటు అధునాతన విధానంలో వైద్య సేవలు అందించే దవాఖాన అనుసంధానమై ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రయాణాల్లో కీలక భూమిక పోషించనున్నది. -పుప్పాల రాధాకృష్ణ
ప్రజలకు ఏదైతే అవసరమో వాటిని గుర్తించి అనతి కాలంలోనే అందుబాటులోకి తీసుకొస్తూ కృత నిశ్చయంతో ప్రణాళికాబద్ధ్దంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాతనగరంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్తో పాతనగరం కొత్త నగరానికి ధీటుగా అభివృద్ధ్దిలో దూసుకుపోనుంది. -మహేందర్,టీఆర్ఎస్ నాయకులు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాతనగరంపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ నగరంతో పాటు పాతబస్తీని సైతం అభివృద్థి పథంలో నిలుపుతున్నారు. పాతనగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ పాతనగర ప్రజల కలలను నెరవేరుస్తున్నారు. – గిరిధర్ నాయక్, స్థానికుడు
అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు జాఫ్రీ, యెగ్గే మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్రావు, స్వర్ణలతారెడ్డి, స్వప్నసుందర్ రెడ్డి, సునరితారెడ్డి, రమణారెడ్డి, సుందర్ రెడ్డి, భూమేశ్వర్, సునీత్పత్తి, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.