Lakaram cable bridge | ఖమ్మం నగరం పర్యాటక శోభను సంతరించుకుంటుంది. నగరంలోని లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. ఇప్పటికే లకారం చెరువు – ట్యాంక్బండ్ను అభివృద్ధి చేసిన అధికారులు.. మరింత పర్యాటక ఆకర్షణ కోసం రూ. 8కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. దీనికి సంబంధించిన పనులు అన్నీ పూర్తి కావడంతో.. దీనికి సంబంధించిన ఫొటోను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిర్మాణం బాగుందని అభినందించారు.