మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్లో ఐస్ క్రీం కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్యాంక్లోని హోటల్ గోల్కొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూప్స్ ఐస్ క్రీం మేనేజింగ్ డైరెక్టర్, ఐఐసీఎంఏ అధ్యక్షులు సుధీర్ షా, హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు, ఎండీ రాజగోపాల్, దూద్ల డైరీ హెడ్ అజయ్ సింహా, 2018 మిస్ ఇండియా, సినీనటి స్పందనా పల్లి తదితరులు పాల్గొని కాంటెస్ట్ ఉద్దేశం వివరించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూఎన్నో ప్రత్యేకతలు కల్గిన ఐస్క్రీమ్ను కళ్లతో చూసి ఫ్లేవర్ ఏంటో చెప్పడం సులువు అని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్ క్రీం తిని ఫ్లేవర్ చెప్పడం కష్టం అని తెలిపారు. ఐస్క్రీం టేస్ట్ కాంటెస్ట్లో కళ్లకు గంతలు కట్టుకుని రుచి చూసి ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుందని, అలా రుచులను కరెక్ట్గా చెప్పిన వారిని విజేతగా ప్రకటించి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు 83409 74747 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరుతున్నారు.