దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సఫ్దార్గంజ్ ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మింటో బ్రిడ్జి సహా పలు అండర్ పాస్ల్లో భారీగా నీరు చేరడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.