ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్. సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు.. ఏరేటర్స్, ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఏర్పాటు చేసి లోటస్ పాండ్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఫొటోలను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రేట్ జాబ్ అని జీహెచ్ఎంసీ అధికారుల కృషిని ప్రశంసించారు. ఇలాంటివి మరిన్ని చేయాలని సూచించారు.