ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్లోని 12పంపులను ఆన్ చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు. ఇక్కడి సరస్వతీ పంపు హౌస్లోని తొమ్మిది పంపులను ఆన్ చేసి 26,370 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ పార్వతీ పంపుహౌస్లోని 10పంపులను ఆన్ చేసి 26,100 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. అలాగే ధర్మారం మండలం నంది మేడారంలోని లింక్-2లోని తొలి పంపు హౌస్ నందిలో ఏడు పంపులకు గానూ ఆరింటిని ఆన్చేసి 18,900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంపు హౌస్లో ఆరు పంపులను ఆన్ చేసి 18,900 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్