Central farm laws | అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కిసాన్ ఉద్యమాలు హోరెత్తించాయి. ముఖ్యంగా ఇవాళ పంజాబ్, హర్యానా రైతులు ప్రధాని ప్రకటనతో ఇక ఆనందంలో తేలారు. సీఎం కేసీఆర్ నేపథ్యంలోనూ తెలంగాణ సర్కార్ కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.