సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. గరిష్ఠం 41.7డిగ్రీలు, కనిష్ఠం 28.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 3రోజులు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు.