yamuna river | యమునా నది కాలుష్యం తీవ్రస్థాయికి పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా యమునా నదిలో నురుగలు ఉప్పొంగిపోతున్నది. ఉత్తరాది ప్రజలు ప్రముఖంగా జరుపుకునే ఛాత్ పూజ సమయంలో యమునా నది కాలుష్య కారకంగా మారడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని కాలిందికుంజ్ ప్రాంతంలో విషపూరితమైన నురుగ జోరుగా ప్రవహిస్తుంటే.. భక్తులు ఆ నీటిలోనే పుణ్యస్నానాలు ఆచరించారు. యమునా నది చాలా దుర్గంధమైనదని.. అది ప్రమాదమని తెలిసినా తప్పట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.