లేగకు బారసాల నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు. సిద్దిపేటలోని తన నివాసంలో మంగళవారం పుంగనూర్ జాతికి చెందిన ఆవుకు జన్మించిన లేగకు బారసాల చేశారు. పూలతో అలంకరించిన తొట్టెలో లేగను వేశారు. ముత్తయిదువుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య లేగకు ‘వకులామాత’గా నామకరణం చేశారు. అనంతరం లేగ ఆశీర్వాదాన్ని తీసుకొన్నారు.
సిద్దిపేట టౌన్