అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాల, లోక్సత్తా ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ వ్యక్తి అరగుండు, అరమీసంతో గాడిదపై కూర్చోని మెడలో చెప్పులు, చీపురు దండతో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అవినీతికి వ్యతిరేకంగా ఊరేగింపు ర్యాలీ నిర్వహించాడు. ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది.
– హనుమకొండ చౌరస్తా